News March 22, 2025
MBNR: ‘పల్లెల్లో అడుగంటిన అభివృద్ధి’

పాలమూరులో గడచిన 14 నెలలుగా గ్రామాల్లో స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి తెచ్చింది. గత 14 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి అడుగంటి పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు,పారిశుద్ధ్యం, మురుగు, తాగునీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 24, 2025
మహబూబ్నగర్: ‘ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి భూపాల్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారని, కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా పోరాటాలను మాత్రం ఆపలేరని భూపాల్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
News March 24, 2025
MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

మహబూబ్నగర్లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
News March 24, 2025
కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.