News January 30, 2025
MBNR: పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

పాలమూరు యూనివర్సిటీ(పీయూ) డిగ్రీ- I, III & V ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.palamuruuniversity.com వెబ్ సైట్లో పొందుపరచామన్నారు. సెమిస్టర్-Iలో 32.61%, సెమిస్టర్-IIIలో 37.75%, సెమిస్టర్-Vలో 48.81% మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజ్ కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.
News November 17, 2025
హనుమకొండ: కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో దాస్యం భేటీ

కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు ముచ్చటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు పులి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
News November 17, 2025
EVM గోడౌన్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.


