News March 28, 2024

MBNR: పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది

image

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే క్రాస్ ఓటింగ్ భయం ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారు పార్టీకి మరో షాక్ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు.

Similar News

News January 24, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రద్దు !

image

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన ఉద్యోగులపై కలెక్టర్ విజయేందిర కొరడా ఝుళిపించారు. వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు డబుల్ ఇళ్ల కేటాయించారన్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, రిటైర్డ్, పెన్షనర్లు ఇళ్లు పొందినట్లు తేలింది. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాని చెప్పారు.

News January 24, 2025

పాలమూరు ఎత్తిపోతలకు పీఆర్ఎల్ఐ పథకంగా నామకరణం

image

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్ఐ పథకంగా పేరు పెడుతూ.. నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

News January 24, 2025

హన్వాడ: మహిళ అదృశ్యం.. కేసు నమోదు

image

ఓ మహిళ అదృశ్యమైన ఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల ప్రకారం.. మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల చెన్నమ్మ (30) ఈనెల 17న పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలు తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.