News October 21, 2024
MBNR: పోలీస్ అమరులకు జోహార్లు !

ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తుంటారు. పాలమూరు జిల్లాలో 39 మంది పోలీసులు అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలోనే మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి సోమశిలదే(1993). NGKL-32, NRPT-1, MBNR-2, WNPT-4 మంది పోలీసులు చనిపోయారు. వీరిని గుర్తు చేసుకుంటూ నేటి నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ సందర్భంగా త్యాగాలను స్మరించుకుంటున్నారు.
Similar News
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
News December 9, 2025
MBNR: ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన పి.ఓలు, ఓ.పి.ఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల అనుసరించి క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.


