News March 26, 2025
MBNR: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాఎస్పీ డి. జానకి, ప్రత్యేకంగాతెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి & కల్తీకల్లు నిర్మూలన పోస్టర్ను విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.
Similar News
News April 1, 2025
మహబూబ్నగర్: ఇటుక బట్టీలో ఛిద్రమవుతోన్న బాల్యం..!

మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలోని కోడూరు గ్రామం దగ్గర చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పలక, బలపం పట్టాల్సిన చేతులు యాజమాన్యాల కింద నలిగిపోతున్నాయి. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కు చెందిన చిన్నారులను బడిలో ప్రవేశం కల్పించకుండా బాల కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, విద్య,శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో సంరక్షించాలని స్థానికులు కోరారు.
News April 1, 2025
MBNR: తప్పుడు కేసులకు భయపడొద్దు: మాజీ మంత్రి

తప్పుడు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాసానిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత రవి నేరంలో ప్రమేయం లేకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. జైలుకి వెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.
News March 31, 2025
మహబూబ్నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.