News March 26, 2025

MBNR: ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ  

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి, కల్తీ కల్లు నిర్మూలనకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాఎస్పీ డి. జానకి, ప్రత్యేకంగాతెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు రూపొందించిన గంజాయి & కల్తీకల్లు నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.

Similar News

News April 23, 2025

నాగర్‌కర్నూల్: 60 రోజులు.. కొనసాగుతున్న అన్వేషణ..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి SLBC సొరంగంలో ప్రమాద ఘటనకు 60 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఆరుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. డీ-1 నుంచి డీ-2 ప్రదేశం వరకు దాదాపు శిథిలాలు తొలగించారు. డేంజర్ జోన్ అయిన మిగిలిన 43 మీటర్ల పరిధిలో ఆ ఆరుగురి మృతదేహాలు ఉండొచ్చని సిబ్బంది అభిప్రాయానికి వచ్చారు. 12 రకాల విభాగాల అధికారులు నిత్యం రెస్క్యూ చేస్తున్నారు.

News April 23, 2025

నారాయణపేట: బాలికపై అత్యాచారం.. జైలుకు యువకుడు

image

NRPT జిల్లా దామరగిద్ద వాసి <<16176540>>బోయిని శ్రీనివాస్(24)<<>> ఓ బాలికను HYDలోని ఓ కిరాయి రూమ్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం నిందితుడిని పట్టుకుని కోస్గి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. అతడిని MBNR సబ్‌ జైలుకు తరలించామన్నారు.

News April 23, 2025

గద్వాల: ఇంటర్ FAIL అవుతానేమోనని చనిపోయాడు.. కానీ పాసయ్యాడు!

image

ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా మల్దకల్(M) మల్లెందొడ్డికి చెందిన వినోద్(18) గద్వాల GOVT జూనియర్ కాలేజీలో ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో ఇటీవల పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!