News May 12, 2024
MBNR: ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు

కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News February 18, 2025
MBNR: బయోమెట్రిక్ లేకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. సోమవారం తన ఛాంబర్ లో బయోమెట్రిక్ విధానం పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ ను పాటించాల్సిందేనని, అలా కాకుండా గైర్హాజర్ అయితే వారిని సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు బయోమెట్రిక్పై ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
News February 18, 2025
MBNR: ఐదుగురు డిప్యూటీ తహశీల్దారులు బదిలీ!

జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి బదిలీ చేశారు. జడ్చర్ల డీటీగా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డి ని కలెక్టరేట్లోని డీఎస్ఓ డీటీగా నియమించగా, డీఎస్ఓ లో డీటీలుగా పనిచేస్తున్న శ్యాంసుందర్ రెడ్డిని మహబూబ్నగర్ రూరల్ డీటీగా, ఈయనతో పాటు కిషోర్ ని జడ్చర్ల డీటీగా, నావాబ్ పేట డీటీ గాయత్రిని మహబూబ్నగర్ డీటీగా, రూరల్ డీటీ సువర్ణను నవాబ్ పేట్ డీటిగా నియమించారు.