News December 17, 2024
MBNR: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. MBNRలో 20,584 మందికి 54 కేంద్రాలు, NGKLలో 9,731 మందికి 32 , గద్వాలలో 8,722 మందికి 25, WNPలో 8,569 మందికి 31 కేంద్రాల్లో NRPTలో 3,994 మందికి 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలువురు ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించలేదు. పోలీసుసు పటిష్ఠ బందోబస్తు నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీలు, ఉన్నతాధికాలులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.
Similar News
News January 16, 2025
శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు
శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
News January 16, 2025
UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News January 16, 2025
వనపర్తి: పాముకాటుతో అత్తాకోడళ్ల మృతి
పాముకాటుతో అత్తాకోడళ్లు మృతిచెందారు. ఈ ఘటన వరపర్తి జిల్లా వీపనగండ్లలోని వల్లభాపురంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. ఈనెల 6న అత్త కిష్టమ్మ(75)ను ఎడమ చేతిపై పాము కాటేయడంతో మరణించింది. కాగా, ఈనెల 12న కోడలు ఎల్లమ్మ(52) ఇంటి అరుగుపై పడుకొని ఉంది. ఈక్రమంలో నాగుపాము ఆమె కాలిపై కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.