News March 17, 2025

MBNR: ప్రేమించుకుని పెళ్లి.. నెలన్నరకే ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలో నవ వధువు ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లాకు చెందిన చర్చిత(23) ఖమ్మంలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 45రోజుల క్రితం పెళ్లిచేసుకున్నారు. కారణం ఏంటో తెలియదు కాని పవన్ ఇంట్లో నుంచి బయటికెళ్లగానే చర్చిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Similar News

News December 4, 2025

కాకినాడ: రాష్ట్రానికి పర్యాటకుల వెల్లువ

image

‘దేఖో అప్నా దేశ్’ స్ఫూర్తితో రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడుతోంది. 2024లో రికార్డు స్థాయిలో 29.2 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీ సానా సతీశ్ గురువారం పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. పర్యాటక వృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని మంత్రి తెలిపారు.

News December 4, 2025

కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

image

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2025

రాజన్న సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి గురువారం హాజరయ్యారు.