News March 24, 2025
MBNR: ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ఈ వారం ప్రజావాణికొచ్చిన 125 ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏ వారం ఫిర్యాదుల్ని ఆ వారమే పరిష్కరించాలని చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే పరిష్కరించి తనకు నివేదించాలన్నారు.
Similar News
News November 4, 2025
MBNR: U-14, 17 కరాటే.. నేడు ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-14, 17 విభాగంలో కరాటే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్సీఎఫ్ కార్యదర్శి Dr.ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. నవంబర్ 4న మహబూబ్నగర్లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్లో ఎంపికలు నిర్వహిస్తామని, అండర్-14 విభాగంలో 1.1.2012లో, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని, ఆసక్తిగల బాల, బాలికలు పీడీ నరసింహను (94928 94606) సంప్రదించాలన్నారు.
News November 3, 2025
MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 3, 2025
కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


