News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Similar News
News October 19, 2025
గద్వాల: దీపావళి జాగ్రత్తగా జరుపుకోండి: ఎస్పీ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ ఎస్పీ శ్రీనివాసరావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సంతోషంగా, వెలుగుల పండుగగా జరుపుకోవాలని ఆయన కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు, యువత తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని, ప్రమాదకరమైన వాటిని వాడకూడదని ఎస్పీ సూచించారు.
News October 19, 2025
సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

చీరాల బీచ్లో పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా సముద్రంలో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వేటపాలెం మండలం పొట్టి సుబ్బాయపాలెం బీచ్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బాపట్ల, చీరాల బీచ్కు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలన్నారు.
News October 19, 2025
కృష్ణా: దీపావళి వ్యాపారాలపై వరుణుడి ప్రభావం

ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలో దీపావళి వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండుగ ముందు రోజే పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్కు రావాల్సిన ప్రజలు వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. వర్షం ఆగకపోతే పండుగ రోజు కూడా వ్యాపార నష్టం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.