News March 2, 2025

MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

image

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

Similar News

News November 16, 2025

19న అకౌంట్లలోకి రూ.7,000?

image

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్‌తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్‌నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.

News November 16, 2025

వంటింటి చిట్కాలు

image

* సమోసా పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా త్వరగా పూర్తవుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైతే స్పూన్‌ శనగపిండి కలపండి.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ మెత్తగా మంచి రంగులో ఉంటుంది.

News November 16, 2025

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

image

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనుమల్లి పేటకు చెందిన బొడ్డు శ్రీనివాస్‌(45) మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. మిర్యాలగూడ వైపు బైక్‌పై వెళ్తున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ కిందపడగా, ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.