News March 2, 2025
MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
Similar News
News December 16, 2025
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ‘NO ఫ్యూయల్’

పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వెహికల్స్కు ఫ్యూయల్ నింపొద్దని పెట్రోల్ పంపులకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం దారుణంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ నడుపుతున్న వారికి SEPలో విధించిన చలాన్లలో 17% PUC సర్టిఫికెట్ లేనివి కాగా OCTలో 23%కి పెరిగాయి.
News December 16, 2025
వచ్చే నెలలో భోగాపురంలో ట్రయల్ రన్: రామ్మోహన్ నాయుడు

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, విమానాశ్రయాన్ని అందంగా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో లోకేశ్, రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఏవియేషన్ రంగం 12% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని వివరించారు.
News December 16, 2025
ధర్మారం: డబ్బు, మద్యం పంచకుండా సర్పంచ్ అయిన వృద్ధుడు

ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో ఈనెల 14న జరిగిన ఎన్నికల్లో 70 సంవత్సరాల వృద్ధుడు సున్నం రాజయ్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజయ్య గతంలో పలుమార్లు సర్పంచ్గా నామినేషన్ వేసి పలువురి ఒత్తిళ్లతో ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఎందరు బుజ్జగించినా వినకుండా బరిలో నిలిచారు. ఎలాంటి డబ్బు, మద్యం పంచకుండా 281 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థిపై 26 ఓట్ల తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు.


