News July 25, 2024
MBNR: బదిలీల్లో అన్యాయం జరిగిందని టీచర్ల దరఖాస్తులు

జీఓ 317లో ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత, మెడికల్, స్పౌజ్ అంశాలలో అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1402 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా, అత్యధికంగా NGKL జిల్లాలో 566 టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అప్పిలేట్ చేసుకున్న దరఖాస్తులను విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు డిఇఓ రవీందర్ వెల్లడించారు.
Similar News
News February 11, 2025
NGKL: బైక్ కొనివ్వనన్నందుకు తండ్రి ఆత్మహత్యాయత్నం

కోడేరు మండల కేంద్రంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. కోడేరుకు చెందిన వెంకటశేషయ్య బైక్ కొనివ్వాలని తన కొడుకుని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో.. ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.
News February 11, 2025
మన్యంకొండకు ప్రత్యేక బస్సులు

ఈ నెల 12, 13వ తేదీల్లో మన్యంకొండ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని MBNR, NRPT డిపోల నుంచి తీసుకున్న 20 బస్సుల ద్వారా దాదాపు 150 అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. కొండ మీదికి 20 మినీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News February 10, 2025
MBNR: వైభవంగా మన్యంకొండ శ్రీనివాసుడి సూర్యప్రభ వాహన సేవ

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు మాఘశుద్ధ త్రయోదశి సోమవారం రాత్రి స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అలమేలు, మంగ పద్మావతి అమ్మవార్లతో వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చాడు. పట్టు వస్త్రాలు, వజ్రకవచం అలంకరించి గోవింద నామ స్మరణ మధ్య సూర్యప్రభ వాహనంపై మెట్ల దారిలో ఊరేగించారు. ధర్మకర్తలు అళహరి మధుసూదనాచారి పాల్గొన్నారు.