News April 4, 2025
MBNR: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ఉస్మానియాలో MA సోషియాలజీ పూర్తి చేశారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Similar News
News December 3, 2025
ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.
News December 3, 2025
VZM: ఈ నెల 14తో తీరనున్న గడువు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇళ్ల స్థలాల కోసం వివరాలు, అవసరమైన భూమి వంటి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
News December 3, 2025
తరుగు తీయొద్దు.. రైస్ మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

హనుమకొండలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు తరుగు తీయవద్దని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని దింపుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR) లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. కేటాయింపులు పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.


