News February 23, 2025
MBNR: బాలానగర్లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 16, 2025
ముస్తాబాద్: ఎన్నికలు.. పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా 730 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే మండలాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
News December 16, 2025
18 నుంచి వినియోగదారుల అవగాహన వారోత్సవాలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వినియోగదారుల అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. వినియోగదారులకు వారి హక్కులు, వాణిజ్య పద్ధతులపై అవగాహన కల్పించి, ఆత్మవిశ్వాసంతో హక్కులను వినియోగించుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు.
News December 16, 2025
జిల్లాలో అదనపు ఇసుక రేవులకు అనుమతులు జారీ

ప్రజల అవసరాల కోసం అదనపు ఇసుక రేవులకు అనుమతులను మంజూరు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రజల అవసరాల కోసం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నూతనంగా 2 ఇసుక రేవులకు అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. మంజూరు చేసిన ప్రాంతాల్లో తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


