News April 8, 2025

MBNR: బుడియా బాపు ప్రత్యేకత (1/2)

image

బుడియా బాపును బంజారా ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. ఆయనను సేవ్యసాత్ అని కూడా పిలుస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గిరిజన తండాల్లో ఎక్కువగా పూజిస్తారు. బుడియా బాపు ఆలయం నల్గొండ జిల్లా రంగుండ్ల తండా గ్రామంలో ఉంది. బుడియా బాపును బంజారా ప్రజలు తమను తమ తండాలను అన్ని రకాల ఆపదల నుంచి రక్షించే దైవంగా నమ్ముతారు. ఆయనను ఆరాధించడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని,దీర్ఘకాలిక రోగాలు నయం అవుతాయని వారు విశ్వసిస్తారు.

Similar News

News December 23, 2025

రేపు నల్గొండలో ట్రై సైకిళ్ల పంపిణీ

image

జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఈసీఐఎల్ సీఎస్‌ఆర్ నిధుల కింద సుమారు రూ.70 లక్షల వ్యయంతో 105 మంది బాధితులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఈసీఐఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.

News December 23, 2025

సంగారెడ్డి: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలి: ఎస్పీ

image

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేసి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

News December 23, 2025

ఏఐ ‘దాహం’.. బిలియన్ల లీటర్ల నీరు స్వాహా!

image

మనం ఒక AI చాట్‌బాట్‌ను చిన్న ప్రశ్న అడిగినా.. వెనుక సర్వర్లు వేడెక్కిపోతాయన్న విషయం మీకు తెలుసా? వాటిని చల్లబరచడానికి బిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2025లో AI వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 765 బిలియన్ లీటర్ల నీరు వాడినట్లు అంచనా. ఇది గ్లోబల్ బాటిల్ వాటర్ ఇండస్ట్రీ మొత్తం వినియోగించే నీటితో సమానం. మనం వాడే సాంకేతికత వెనుక ఇంతటి ‘నీటి దాహం’ దాగి ఉందన్నమాట.