News October 19, 2024
MBNR: మరణ శాసనాలుగా మారుతున్న డీజేలు
డీజేలు మరణ శాసనాలుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గంటల పాటు డీజేల వద్ద డ్యాన్స్లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు అనేకం. దసరా ఉత్సవాల్లో వనపర్తి జిల్లా అమరచింత మండలం మిట్టనందిమల్లలో 28 ఏళ్ల ఓ యువకుడు డీజే వద్ద డ్యాన్సు చేశాడు. ఇంటికి వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అధిక శబ్దాలు ఇచ్చే డీజేలతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
Similar News
News October 19, 2024
రేపు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నిరసనలు
ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడంపై నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని శ్రేణులకు కేటీఆర్ సూచనలు చేశారు.
News October 19, 2024
NRPT : విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : టీపీటీఎఫ్
ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారిలు సూచించారు. నారాయణపేటలోని అంబేడ్కర్ భవన్లో విద్యారంగ సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
News October 19, 2024
జూరాల ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా నీటి విడుదల
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో.. శుక్రవారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వివిధ రూపాల్లో మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.