News February 27, 2025
MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయం వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Similar News
News October 24, 2025
డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందించాలి: వనపర్తి ఎస్పీ

వనపర్తి జిల్లాలో డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యాచరణను అవలంబిస్తూ, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపుమాపేలా కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా గట్టిగా గస్తీ నిర్వహించాలన్నారు.
News October 24, 2025
ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

భారత్తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ ఆఖరి 3 మ్యాచ్లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్మ్యాన్, డ్వార్షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్లూ ఆడనున్నారు.
News October 24, 2025
కరెంట్ షాక్కు గురై వ్యక్తి మృతి

ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నవరం రైల్వే స్టేషన్లో కరెంట్ షాక్కు గురైన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. ఈనెల 19న గన్నవరం రైల్వే స్టేషన్లో అతను కాక్కు గురయ్యాడు. రైల్వే సిబ్బంది అతన్ని విజయవాడ తరలించారు. సమాచారం తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ ఎస్సై శివన్నారాయణ సూచించారు.


