News February 27, 2025
MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయం వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Similar News
News December 3, 2025
చెక్-ఇన్లో టెక్నికల్ గ్లిచ్.. విమానాలు ఆలస్యం

సాంకేతిక సమస్యల వల్ల విమానాల రాకపోకల్లో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఎయిర్పోర్టుల్లోని చెక్-ఇన్ వ్యవస్థలో టెక్నికల్ గ్లిచ్ వల్ల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు పేర్కొంది. చెక్-ఇన్ ప్రాబ్లమ్తో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు బారులుతీరారు. విమానాల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 3, 2025
ప్రకటనే పవన్ సమాధానమా?

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
జగిత్యాల కళాశాలలో వసతులపై ఆడిట్ బృందం సంతృప్తి

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు అకాడమిక్ ఆడిట్ బృందం నేడు తనిఖీ చేసింది. హుజురాబాద్ ప్రిన్సిపల్ డా. పి. ఇందిరా దేవి, డా. శ్రీనివాస్ విభాగాలను పరిశీలించారు. అధ్యాపకులు విద్యార్థుల విజయాలను వివరించారు. వసతులు, వనరులపై ఆడిట్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశంలో ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ, స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.


