News March 23, 2025

MBNR: మార్చి 31తో ముగియనున్న ఎస్సీ ఉపకార వేతనాల గడువు

image

ఎస్సీ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడవు మార్చి 31తో ముగియనుందని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 70% మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసుకొని వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్‌లను కోరారు. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలన్నారు.

Similar News

News December 17, 2025

11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 17, 2025

సిద్దిపేట జిల్లాలో 11AM@60.15% పోలింగ్

image

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలకు 60.15 % నమోదైంది. అక్కన్నపేట-62.62%, చేర్యాల-57.62%, ధూల్మిట్ట-63.39%, హుస్నాబాద్-58.22%, కోహెడ-59.72%, కొమురవెల్లి-61.61%, కొండపాక-62.89%, కుకునూరుపల్లి-66.72%, మద్దూరు-49.93% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతనే.!

image

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఎన్.ఎం.డీ ఫిరోజ్ నియమితులయ్యారు. ఆయన మూడో సారి ఈ పదవిని చేపట్టారని నాయకులు తెలిపారు. అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ వేశారు. అయితే ఆ పదవి ధర్మవరం సుబ్బారెడ్డికి వెళ్లడంతో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.