News March 23, 2025
MBNR: మార్చి 31తో ముగియనున్న ఎస్సీ ఉపకార వేతనాల గడువు

ఎస్సీ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడవు మార్చి 31తో ముగియనుందని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 70% మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసుకొని వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్లను కోరారు. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలన్నారు.
Similar News
News December 19, 2025
GNT: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఆర్మ్డ్రిజర్వ్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అనేది ప్రేమ, శాంతి, కరుణ, మానవత్వానికి ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. యేసుక్రీస్తు చూపిన సేవాభావాన్ని పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
News December 19, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: హనుమకొండ కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి, అక్కడ రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్, రవాణా అధికారులు పాల్గొన్నారు.
News December 19, 2025
NZB: పల్లెల్లో మళ్లీ ఓట్ల పండుగ

పల్లెల్లో మళ్లీ ఓట్ల పండుగ రాబోతుంది. సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం డీసీసీబీ పీఏసీఎస్ల పాలకవర్గాలు రద్దు చేసింది. నెల రోజుల్లోగా సొసైటీల ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. గ్రామాల్లోని సొసైటీల డైరెక్టర్లను రైతులు ఓట్లు వేసి ఎన్నుకుంటారు. డైరెక్టర్లు చేతులెత్తి సొసైటీ ఛైర్మన్లను ఎంపిక చేస్తారు. ఛైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను ఎంపిక చేయగా వారు జిల్లా ఛైర్మన్ను ఎంపిక చేస్తారు.


