News March 26, 2025

MBNR: మున్సిపల్ కార్మికులకు దక్కిన గుర్తింపు..!

image

తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా పాలమూరు జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు గుర్తింపు దక్కిందని స్థానికులు తెలిపారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తూ పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కష్టపడుతున్నారు. వారి సేవలను గుర్తించిన మున్సిపాలిటీ వారి విగ్రహాలను రోడ్డుపై ఏర్పాటు చేసింది. వారి కష్టాన్ని గుర్తించి, అందరూ అభినందించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. 

Similar News

News April 21, 2025

త్వరలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

image

TG: 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి మొబైల్ వాహనాలను పంపి పరీక్షలు నిర్వహించనుంది. లక్షణాలు బయటపడితే చికిత్స అందించనుంది. తొలి దశలో భద్రాద్రి, ఆదిలాబాద్, MBNR, సంగారెడ్డి, KNR జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

News April 21, 2025

పాలకొల్లు: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలకొల్లుకు చెందిన వెంకటరావు, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద వివరాలను వెల్లడించారు. కొంతకాలంగా HYD, విశాఖ కేంద్రంగా వారు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు యడ్ల నాగేశ్వరరావు, తాతాజీ పరారీలో ఉన్నారన్నారు. ప.గో.జిల్లా నరసాపురం, కోనసీమ(D) రాజోలు, సఖినేటిపల్లికి చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నట్టు సమాచారం.

News April 21, 2025

HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

error: Content is protected !!