News April 4, 2025
MBNR: ముస్లిం మహిళల మేలు కోసమే వక్ఫ్ బోర్డు: ఎంపీ

భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025కు లోక్ సభ, రాజ్యసభల్లో రాజముద్ర పడిందన్నారు. పేద ముస్లింలు, ముస్లిం మహిళల మేలు కోసం, వక్ఫ్ బోర్డులో పారదర్శకత కోసం ఈ సవరణ బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలను అమలుపరుస్తూ దేశ సంక్షేమం కోసం బీజేపీ ముందుంటుందని అనడానికి ఈ బిల్లు ఆమోదమే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.
Similar News
News December 3, 2025
WNP: డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి.. పత్రం అందజేత

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివసేనారెడ్డి బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని స్వీకరించారు. జిల్లాలో అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానని శివసేనారెడ్డి పేర్కొన్నారు.
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.
News December 3, 2025
తిరుపతి: పట్టని ప్రయోగంతో భవిష్యత్తు ఎటు.!

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మరో 2 నెలల కాలంలో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 109 ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 25వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు ప్రయోగాలు చేపించిన పరిస్థితి లేదు. ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేట్ కళాశాలలు వైపు చూసే పరిస్థితి కూడా లేదు. అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


