News May 25, 2024
MBNR: మూడు విడతల్లో ఇంటర్ మూల్యాంకనం

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్ను ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ జరగనుందని జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టనున్నారు.
Similar News
News February 14, 2025
చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.
News February 14, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడు షబ్-ఎ-బరాత్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా “షబ్-ఎ-బరాత్”కు ముస్లింలు అన్ని మస్జిద్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. షాబాన్ నెలలో 15వ(నేడు) రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ ఆరాధనలు చేస్తూ, తమ కోసం, తమ ప్రియమైనవారి కోసం అల్లాహ్ దయను కోరుతూ గడుపుతారు. షబ్-ఎ-బరాత్ను క్షమాపణ రాత్రి లేదా ప్రాయశ్చిత్త దినం అని కూడా పిలుస్తారు.
News February 14, 2025
MBNR: హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. గోపి గురించి మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో లేబర్ రూమ్ను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్న తల్లి బిడ్డలను పరామర్శించారు.