News March 22, 2025
MBNR: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News December 20, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు..అప్పులు తీర్చేదెలా..?

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’ అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి.
News December 20, 2025
MBNR: ఊర్లో సంబరాలు.. యువతిపై అత్యాచారం

సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాల నడుమ ఘోర విషాదం MBNR(D) మూసాపేట(M) మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. SI వేణు వివరాల ప్రకారం.. సంబరాలను వీక్షించడానికి వచ్చిన ఓ యువతిని విష్ణు రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెరేంట్స్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
News December 20, 2025
మహమ్మదాబాద్: గ్రూప్-3 జాబ్ సాధించిన మండల వాసి

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మిరియాల హనుమంతు కుమారుడు మిరియాల యాదగిరి గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గండీడ్, మహమ్మదాబాద్ మండలాల నేతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వంగా ఉందని యాదగిరి “Way2News” ప్రతినిధితో తెలిపారు.


