News March 12, 2025
MBNR: యాసంగి పంటలను పరిశీలించిన కలెక్టర్

ఈ వేసవిలో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వారికి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులు ఆదేశించారు. కోయిలకొండ మండల పరిధిలోని సంగనోని పల్లి సేరి వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేసవి పంటలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండలకు నీటి జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించారు.
Similar News
News March 13, 2025
MBNR : హోలీ పండుగ.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి కీలక సూచనలు చేశారు. 14వ తేదీ ఉదయం 6 -12 మధ్యాహ్నం గంటల వరకు హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, హోలీ పండుగ ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగు నీరు చల్లడం నిషేధమన్నారు. పబ్లిక్ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం వీధులలో ఇష్టానుసారంగా తిరగడం అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు.
News March 13, 2025
MBNR: ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా మ్యాథ్స్ ,బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తంగా 10,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా కేవలం 10,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 209 మంది జనరల్,51 మంది ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 260మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
News March 12, 2025
MBNR: PHD ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి.!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించిన PHD ప్రవేశ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 17 నుంచి 20 వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది రాసిన ఉమ్మడి పాలమూరు వాసులు రిజల్ట్స్ http://www.teluguuniversity.ac.in వెబ్సైట్లో చూడొచ్చన్నారు.