News March 1, 2025
MBNR: యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 2, 2025
వనపర్తిలో మిత్రుడు.. CMగా వచ్చాడు! (PHOTO)

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.
News March 2, 2025
MBNR: చికిత్స పొందుతూ యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.