News April 4, 2025

MBNR: రజతోత్సవ వేడుకల సమావేశంలో ఆర్ఎస్పీ

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాలను చక్కగా, ఓపికగా కేసీఆర్ వివరించారన్నారు. భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడరాదని దిశా నిర్దేశం చేశారన్నారు.

Similar News

News December 5, 2025

తిరుమలలో ఇద్దరు అరెస్ట్

image

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఫేక్ లెటర్లు సృష్టించారు. వీటి ద్వారా హైదరాబాద్ భక్తులను దర్శనానికి పంపారు. పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీగా గుర్తించారు.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

KMR: జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచుల ఏకగ్రీవం

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఘట్టం రసవత్తరంగా మారింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగియగా..10 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ఏకగ్రీవమైనట్లు DPO మురళి గురువారం వెల్లడించారు. మిగిలిన స్థానాల్లో పోటీ అనివార్యమవడంతో, ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు.