News February 1, 2025

MBNR: రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

image

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 9, 2025

RCPM: కిలో చికెన్ ఎంతంటే?

image

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.110, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ. 180, స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.220కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద వ్యాపారులు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అమ్మకాలు పుంజుకున్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.

News March 9, 2025

రాష్ట్రంలో కొత్త స్కీం.. మొదలైన సర్వే

image

APలో P-4 పేరుతో కొత్త <<15600961>>పథకాన్ని <<>>ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

News March 9, 2025

ఎన్టీఆర్: బీ. ఫార్మసీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల 

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో బీ. ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3,5వ సెమిస్టర్ (రెగ్యులర్) థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 11లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ సెమిస్టర్ ఈనెల 26 నుంచి, 5వ సెమిస్టర్ ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి. 

error: Content is protected !!