News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
Similar News
News February 25, 2026
FSLలో ఉద్యోగాలు.. రేపటి నుంచి హాల్టికెట్లు

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల పరీక్షల హాల్టికెట్లు రేపు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 అర్ధరాత్రి 12 గంటల వరకు <
News February 25, 2026
మాదారం చెరువులో వ్యక్తి గల్లంతు

ఊర్కొండ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మాదారం చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాచాలపల్లి గ్రామానికి చెందిన బూర వెంకటయ్య (42) అనే వ్యక్తి బుధవారం మాదారం చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఆయన చెరువులో పడి గల్లంతైనట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2026
HYDలో ఇలా చేస్తే రూ.2లక్షల FINE!

నిర్మాణ వ్యర్థాల పారబోతపై GHMC పకడ్బందీగా వ్యవహరించనుంది. నాలాలు, చెరువుల్లో వ్యర్థాలు పారబోస్తే రూ.2 లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు డంప్ చేసినా ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. బస్భవన్, VST పాత ఆఫీసు ఎదురు గల్లీలో నిర్మాణ వ్యర్థాలతో రోడ్డు మూసుకుపోవడం గమనార్హం. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.


