News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 15, 2025

VKB: మద్యం షాపుల టెండర్లకు 247 దరఖాస్తులు

image

జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు 247 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లాలోని 59 మద్యం షాపులకు టెండర్లకు దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటివరకు 247 దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 18 వరకు చివరగా మూడు రోజులు మిగిలి ఉండడంతో భారీగా దరఖాస్తులు వస్తాయని తెలిపారు.

News October 15, 2025

జనగామ: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లపై బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషాతో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు దిశానిర్ధేశం చేశారు.

News October 15, 2025

కామారెడ్డి: ‘చట్టాలపై అవగాహన కల్పించాలి’

image

సమాచార హక్కు చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర కమిషనర్ భూపాల్ సూచించారు. బుధవారం రాత్రి కామారెడ్డి జిల్లా ఆర్టీఐ ప్రతినిధి మోతే లావణ్య హైదరాబాద్‌లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిపై పూర్తి వివరాలు సేకరించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు.