News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 10, 2025

డెహ్రాడూన్ స్పెషల్ వీక్లీ ట్రైన్ టెర్మినల్‌లో మార్పు

image

చర్లపల్లి- డెహ్రాడూన్ మధ్య రాకపోకలు సాగించే రైలు టెర్మినల్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 14 నుంచి ప్రతీ మంగళవారం రైలు నం.07077తో హైద్రాబాద్‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా రాకపోకలు సాగనున్నాయి. తిరుగు ప్రయాణంలో రైలు నం.07078 హైద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ప్రతీ గురువారం ఉ. 7గంటలకు డెహ్రాడూన్ లో బయలుదేరుతుంది.

News October 10, 2025

ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి: జేసీ నిషాంతి

image

కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నిషాంతి లైన్ డిపార్ట్మెంట్ అధికారులను, మిల్లర్స్‌ను ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణపై వారికి కలెక్టర్ సూచనలు చేశారు.

News October 10, 2025

విశాఖ: GST.. రేట్లు తగ్గలే..!

image

కేంద్రం తగ్గించిన GST రేట్లపై అధికారులు, నాయకులు విస్తృతంగా అవగాహన చేపడుతున్నా.. వ్యాపారులు పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నట్లు ఉమ్మడి విశాఖలో ఆరోపణలొస్తున్నాయి. ప్రధానంగా నోటుబుక్స్, గ్రాఫ్ బుక్స్, లాబొరేటరీ తదితర వస్తువులపై పన్ను జీరో శాతం చేసినా పాత ధరలతోనే అమ్ముతున్నారంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు పన్ను తగ్గింపు ఫలాలు అందడం లేదు. మరి మీ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉందా? కామెంట్.