News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 8, 2025
ALERT: ప్రవేశాలకు రెండు రోజులే గడువు

TG: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లకు దరఖాస్తు గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ప్రవేశాల కోసం www.braouonline.inలో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించడానికి RASCI సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.
News October 8, 2025
ADB: అడ్మిషన్ల గడువు పొడగింపు

TOSS ద్వారా ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లకు దరఖాస్తుల గడువు పొడగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాద రుసుముతో ఈ నెల 14 నుంచి 23 వరకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 8, 2025
కాకరేపుతోన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు

ప్రస్తుత రాజకీయాలు ఉమ్మడి జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ములకలచెరువులో దొరికిన అక్రమ మద్యం, పరివట్టం వివాదం, దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అంశాలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, విపక్షాల మాటలతో జిల్లాలో రాజకీయాలు కాకరేపాయి. చంద్రబాబు, పెద్దిరెడ్డి వంటి కీలకనేతలు ప్రాతినిధ్యం వహించడం, ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి.