News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 12, 2025

MDK: హైకోర్టు స్టే.. BCల్లో నిరాశ.!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు స్టే విధించడంతో BC వర్గాల్లో నిరాశ నెలకొంది. అదే సమయంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ZPTC స్థానాల్లో రెండు, మూడు మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో వారు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు. పాత రిజర్వేషన్లు అమలైతే తమకు పోటీ చేసే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

News October 12, 2025

అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు

image

1911: భారత మాజీ క్రికెటర్ విజయ్ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్‌మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ(ఫొటోలో)జననం
1983: మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ జననం
1991: హీరోయిన్ అక్షర హాసన్(ఫొటోలో) జననం

News October 12, 2025

జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భీమవరంలో సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుల ప్రచారాన్ని 4 కేటగిరీలుగా విభజించి మూడు వారాలపాటు వివిధ వస్తువుల ప్రదర్శనలతో అవగాహన కలిగించే విధంగా ప్రచారాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.