News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 17, 2025
TODAY HEADLINES

✦ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
✦ మోదీతో ఇండియా ప్రతిష్ఠ ఎంతో పెరిగింది: CM CBN
✦ AIకు AP తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ
✦ BC రిజర్వేషన్లపై TG ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
✦ ఈ నెల 18న TG బంద్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
✦ క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
✦ AUSలో ప్రాక్టీస్ ఆరంభించిన రోహిత్, కోహ్లీ
News October 17, 2025
నగరాలను దాటి గ్రామాల దిశగా ‘ఆతిథ్యం’

‘ఆతిథ్యం’ అంటే నగరాల్లోని స్టార్ హొటళ్లు, దర్శనీయ స్థలాలు మాత్రమే అన్నట్లుండేది. ఇపుడా రంగం టైప్1 నగరాలను దాటి చిన్న పట్టణాల వైపు విస్తరిస్తోంది. HVS ANAROCK డేటా ప్రకారం JAN-APR మధ్య జరిగిన ఒప్పందాల్లో 73.3% టైర్2(31.6), టైర్3, 4(41.7) సిటీల్లో జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల ఉంది. ప్రాంతీయ పండగలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కార్పొరేట్ రీట్రీట్స్, సమ్మిట్స్తో కళకళలాడుతోంది.
News October 17, 2025
NRPT: గోల్డ్ మెడల్ అందుకున్న పేదింటి అమ్మాయి

పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన పూజారి తులసి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈరోజు గోల్డ్ మెడల్ అందుకుంది. పీయూ పీజీ సెంటర్ గద్వాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ 2024 గాను పతకం అందుకుంది. 10th క్లాస్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పేద కుటుంబానికి చెందిన తులసికి గోల్డ్ మెడల్ రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.