News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 9, 2025

గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ వివరాలు ఇలా..!

image

గద్వాల జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి. 13 జడ్పీటీసీ స్థానాలు, 13 ఎంపీపీ స్థానాలు, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 696 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,93,627 పురుష ఓటర్లు, 1,99,78 మహిళా ఓటర్లు, 10 మంది ఇతరులు మొత్తం 3,93,418 మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరందరూ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News October 9, 2025

కల్వకుర్తిలో ఏసీటీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను (ACT) కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.

News October 9, 2025

HYD: మేడిపల్లిలో భూలోక వైకుంఠం

image

శ్మశానం. ఆ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలుతున్న శవాల కమరు వాసనతో భీతి గొలిపే వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా ముండ్ల పొదలు, సమాధులు, చెత్త, చీకటి, అస్తవ్యస్త మార్గంతో జనం వెనుకడుగేస్తారు. దీనికి భిన్నంగా HYD శివారు మేడిపల్లి శ్మశానానికి హైటెక్ సొబగులు అద్దారు. పచ్చిక బయళ్లు, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతోంది. ఆప్తులను కోల్పోయిన వారి దుఃఖాన్ని దూరం చేస్తోంది. వారికి సాంత్వననిస్తోంది.