News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 10, 2025
WPL ఆక్షన్ తేదీలు ఖరారు?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలం నవంబర్ 25-29 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఒక్కో టీమ్ రూ.15కోట్ల పర్స్ కలిగి ఉంటాయని, 2025 స్క్వాడ్ నుంచి ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చని పేర్కొన్నాయి. నవంబర్ 5లోగా జట్ల యాజమాన్యాలు రిటెన్షన్స్ను ప్రకటించాల్సి ఉంటుంది. 2023 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా ముంబై ఇండియన్స్ (2023, 25) రెండుసార్లు, RCB ఒకసారి (2024) విజేతగా నిలిచాయి.
News October 10, 2025
సిద్దిపేట: బీసీ రిజర్వేషన్లపై స్టే.. అంతా సైలెంట్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు కలిపి బీసీలకు 225 దక్కగా, తాజా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 327కు పెరిగింది. కోర్టు స్టే కారణంగా పెరిగిన ఈ స్థానాల భవితవ్యంపై అయోమయం నెలకొంది.
News October 10, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 13లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 23లోపు (ఫైన్తో) అప్లె చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.