News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 9, 2025
బేసిక్ పోలీసింగ్ మర్చిపోయారు: డీజీపీ

TG: రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్తో బేసిక్ పోలీసింగ్ను మర్చిపోయారని DGP శివధర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై రెండూ ఉండాలి. వాహనాల చెకింగ్, కమ్యూనిటీ పోలీసింగ్తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. కిందిస్థాయి నుంచే ఇంటెలిజెన్స్ సేకరించాలి. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజల రక్షణే ధ్యేయం’ అని SPలు, కమిషనర్ల సమావేశంలో మాట్లాడారు.
News October 9, 2025
పాత మహిళా పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ

అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ జగదీశ్ గురువారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి, ఆ స్థలంలో నూతన భవనాలు నిర్మిస్తే పోలీస్ శాఖకు ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిబ్బంది క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.
News October 9, 2025
శివంపేట: అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ

శివంపేట మండలం పంబండ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ గురువారం విచారణ చేపట్టారు. 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిలో ఇల్లు నిర్మిస్తున్న ఎస్సీ కులానికి చెందిన జానకిని కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించి, గొడ్డలితో దాడికి ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అడిగి తెలుసుకున్నారు.