News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 5, 2025
TODAY HEADLINES
*కులగణనతో బీసీ జనాభా పెరిగింది: సీఎం రేవంత్
*సమగ్ర కుటుంబసర్వే ఎందుకు దాచిపెట్టారు?: రేవంత్
*వ్యాపారులను వేధించొద్దు: సీఎం CBN సూచన
*పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు
*ఏపీలో AI సెంటర్ నెలకొల్పండి: లోకేశ్
*బీసీ రిజర్వేషన్లపై చట్టం తేవాలి: కేటీఆర్
*రూ.400 LED బల్బును రూ.40కి తగ్గించాం: PM
*‘తండేల్’ టికెట్ల ధరల పెంపునకు అనుమతి
*శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే రిటైర్మెంట్
News February 5, 2025
భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు
AP: భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. 300చ.మీ. మించని నిర్మాణాలకు యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకే ఈ వెసులుబాటు కల్పించింది.
News February 5, 2025
వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్: కేంద్రం
‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ ద్వారా 45% మందికి జీరో కరెంట్ బిల్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని 8.64లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి దాదాపు రూ.77,800 కేంద్రం అందిస్తోందన్నారు. జీరో బిల్లు అనేది సోలార్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.