News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 15, 2025
ఇదేం పని స్వామీ.. గంజాయితో పట్టుబడ్డ పూజారి!

ఆలయంలో పనిచేసే పూజారి గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఘటన గుంతకల్లులో జరిగింది. హనుమాన్ సర్కిల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు మంగళవారం గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ పశ్చిమగోదావరి జిల్లా వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలోని ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
News October 15, 2025
KMR: డ్రంక్ అండ్ డ్రైవ్లో 69 మందికి జరిమానా, 9 మందికి జైలు శిక్ష

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 69 మందికి మంగళవారం కోర్టులు మొత్తం రూ.85,100 జరిమానా విధించాయి. వీరిలో కామారెడ్డిలో ఐదుగురికి, దేవునిపల్లిలో నలుగురికి చొప్పున ఒక్కొక్కరికీ ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. SP రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. జూదం, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకు ప్రమాదమని, వీటిని మానుకోవాలని హెచ్చరించారు.
News October 15, 2025
నాయీ బ్రాహ్మణ సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్

నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కురగంటి రఘురామయ్య తెనాలిలో తెలియజేశారు. షాపు వద్దకు విద్యుత్ శాఖ సిబ్బంది వస్తే మీటర్ నంబరు, వివరాలు చెప్పవలసి ఉంటుందన్నారు. విద్యుత్ 200 యూనిట్లు మించకుండా ఉంటే ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు. నాయి బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.