News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 14, 2025
BREAKING: HYD: మీర్పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.
News October 14, 2025
కొత్త PF నిర్ణయాలు.. ఒక్కసారి ఆలోచించండి

EPFO ఎంప్లాయి షేర్ 100%తో పాటు ఎంప్లాయర్ షేర్ 100% విత్డ్రాకు అనుమతిస్తూ నిర్ణయించింది. ఇది ఊరటగా భావించి డబ్బు తీసుకుందాం అనుకుంటే.. ఆలోచించండి. ఇతర మార్గాలతో పోలిస్తే ఇక్కడ తీసుకుంటే లాభం అనుకుంటేనే డ్రా చేయండి. ఎందుకంటే ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్లో PFకు ఖాతాకే అధిక వడ్డీరేటు (8.25%) ఉంది. ఇప్పుడు తాత్కాలిక అవసరాలకు సర్దుకుంటే PFలో డబ్బుకు వడ్డీ, వడ్డీపై వడ్డీల లాభం భవిష్యత్తులో అండగా ఉంటుంది.
News October 14, 2025
మెదక్: NMMS దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.