News February 4, 2025

MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 10, 2025

ఊర్కోండలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్టుర్ 29.8, బొల్లంపల్లి 28.8, ఎల్లికల్ 25.3, తోటపల్లి 13.0, ఎంగంపల్లి 11.5, సిర్సనగండ్ల 7.5, కొల్లాపూర్ 1.8, తెలకపల్లి, జటప్రోలు 1.0, అత్యల్పంగా కల్వకుర్తి, కోడేర్‌లో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 10, 2025

ఖమ్మం: యూట్యూబ్‌లో చూసి హతమార్చారు..!

image

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశ్వర్లు(38) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన వెంకటేశ్వర్లును డబ్బు కోసమే ప్రధాన నిందితుడు అశోక్ కిరాతకంగా చంపినట్లు తేలింది. హత్యకు ముందు, మృతదేహాన్ని ముక్కలుగా నరికి పారేసే విధానాన్ని నిందితుడు యూట్యూబ్‌లో చూసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ కేసులో అశోక్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.

News October 10, 2025

సిరిసిల్ల: భార్య లేదని వృద్ధుడు ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI రాహుల్ రెడ్డి దీనిపై కేసు నమోదు చేశారు. పోతు అంజయ్య(70) కొద్ది నెలలుగా మూత్ర, మలవిసర్జన వ్యాధితో బాధపడుతున్నాడు. మృతుడి భార్య ఏడాది క్రితం చనిపోయింది. అనారోగ్య సమస్యలతో పాటు భార్య లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన అంజయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అక్క కళావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.