News April 29, 2024
MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఉండవల్లి మండలంలో జరిగింది. హైదరాబాద్ నుంచి బనగానపల్లికి ఖాసీం అనే యువకుడు బైకుపై వెళ్తున్నాడు. అలంపూర్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ రోడ్డు సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవ్యక్తి తీవ్రగాయాలవ్వడంతో అతన్ని NH 44రోడ్డు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అంబులెన్స్లో కర్నూల్ తరలించారు.
Similar News
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 11.1, గండీడ్ మండలం సల్కర్పేటలో 11.3, మిడ్జిల్లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్పూర్లో 12.7, మహ్మదాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News November 14, 2025
కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.
News November 13, 2025
MBNR: U-14 క్రికెట్.. 150 మంది హాజరు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.


