News March 25, 2025

MBNR: ‘లంబాడీ గిరిజనులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి’

image

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కోరారు. MBNRలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తండాలను పంచాయతీలుగా, గోర్ బోలి భాషను 8 షెడ్యూల్‌లో, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, నిరుద్యోగ భృతి,గిరిజనులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేసి న్యాయం చేయాలన్నారు. గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.

Similar News

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇంటి వద్ద విచారణ

image

నాగర్‌కర్నూల్ జిల్లా <<16145983>>ఊర్కొండపేట<<>> పబ్బతి అంజన్న గుడి వద్ద మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులతో పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేయించిన విషయం తెలిసిందే. కాగా ఘటనా స్థలానికి ఏడుగురు నిందితులను తీసుకొచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టారు. అలాగే అత్యాచారం ఘటన తర్వాత వారు ఇంటికి ఎలా వెళ్లారన్న కోణంపై ఆరా తీశారు. గ్రామంలోని నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.

News April 19, 2025

నాగర్‌కర్నూల్: మహిళపై గ్యాంగ్ రేప్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. శుక్రవారం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. గతంలో నిందితులు ఏమైనా నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

News April 19, 2025

BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

image

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.

error: Content is protected !!