News March 20, 2025
MBNR: ‘వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు తక్షణమే తగిన చికిత్స అందించాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి వైద్యసిబ్బందిని ఆదేశించారు. జానంపేట PHCని ఆకస్మిక తనిఖీచేశారు. అన్ని విభాగాలు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 29, 2025
MBNR: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు.. పోలీసుల WARNING

పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT
News March 29, 2025
MBNR: నేషనల్ ఖో-ఖో జట్టుకు ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా నుంచి 57వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్-2024-25కు మంగలి శ్రీలక్ష్మి, కే.శ్వేత, ఎరుకలి శశిరేఖ ఎంపికయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖోఖో మహిళా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒడిశాలో ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంతో ఎంపికైన క్రీడాకారులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లా నేతలు, తదితరులు అభినందించారు. CONGRATULATIONS❤
News March 29, 2025
MBNR: ‘న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలి’

వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.