News March 24, 2025

MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్‌తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News March 31, 2025

DEJAVU: అప్పుడు.. ఇప్పుడు ఒకేలా..!

image

ఐపీఎల్‌లో CSK, RR మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 2023, 2025లో ఇరు జట్ల మధ్య ఒకే రీతిలో మ్యాచ్ జరిగింది. 2023లో CSK విజయానికి 21 రన్స్ అవసరం కాగా, 2025లో 20 రన్స్ అవసరమయ్యాయి. అప్పుడూ, ఇప్పుడూ క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడూ బౌలర్ సందీప్ శర్మనే. అప్పుడు గెలిచింది, ఇప్పుడు గెలిచింది రాజస్థానే. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు ‘DEJAVU’ అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.

News March 31, 2025

నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

image

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్‌కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News March 31, 2025

బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం.. అందరూ మృతి!

image

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లోని ఓ 33 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల్లో చిక్కుకున్నవారందరూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. లోపల నుంచి దుర్గంధం వస్తుండటంతో ఎవరూ ప్రాణాలతో ఉండరని అంచనా వేస్తున్నారు. కాగా బ్యాంకాక్ వ్యాప్తంగా భూకంపం వచ్చినా ఇది ఒక్క బిల్డింగ్ మాత్రమే కుప్పకూలింది. దీంతో దీనిని నిర్మించిన చైనా ఇంజినీరింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

error: Content is protected !!