News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2025
కిచెన్ టిప్స్

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.
News November 17, 2025
వారానికి 72 గంటల పనితోనే దేశాభివృద్ధి: మూర్తి

వారానికి 72గంటలు పనిచేయాలన్న గత వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
News November 17, 2025
ఉమ్మడి విశాఖ జిల్లాలకు 28 బంగారు పతకాలు

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు 28 బంగారు, 8రజతం, 12 కాంస్యం పతకాలు లభించాయి. ఈనెల15 నుంచి 16 వరకు కాకినాడ, సూర్యకళామందీర్ కళ్యాణమండపంలో రాష్ట్రస్థాయి జూనియర్, క్యాడిట్, సీనియర్ క్యొరుగి, ఫూమ్ సే తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్లో చోడవరం, అనకాపల్లి విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.


