News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
HYD: DEC 8న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్

HYD శివారు మీర్ఖాన్ పేట పరిధిలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బందోబస్తును రాచకొండ సీపీ సుధీర్ బాబు పర్యవేక్షించారు. పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశం, మీటింగ్ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి IPS ఉన్నారు.
News November 15, 2025
జగిత్యాల: మూడు రోజులు నీటిసరఫరా బంద్

జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం వెంకట్రావుపేటలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో మరమ్మతుల వల్ల 3 రోజులు నీటి సరఫరా నిలిపివేస్తామని కార్యనిర్వాహక ఇంజినీర్ M.జానకి తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గం (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలు మినహాయించి) పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు అందించలేమని అన్నారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>


