News March 26, 2025

MBNR: వలస కార్మికులకు నివాసయోగ్యమైన ప్రభుత్వ పాఠశాలలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం (వెంకటాపూర్) అవతలిగడ్డ తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వలస కార్మికులకు నివాస యోగ్యమైంది. సరస్వతి నిలయాల్లో వలస కార్మికులు మద్యం, గుట్కా, ధూమపానం సేవిస్తూ పాఠశాల మౌలిక వసతులను అపరిశుభ్రం చేసి, ధ్వంసం చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు మూతబడిన పాఠశాలను వెంటనే తెరిపించి, బడి బయట ఉండే విద్యార్థులను పాఠశాలలో చేరే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 16, 2025

KNR: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

image

KNRలోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన(15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు. KNR-3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 16, 2025

‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

image

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.

News November 16, 2025

పార్వతీపురం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల అహ్వానం

image

సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి అప్పన్న శనివారం తెలిపారు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తును పార్వతీపురంలోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయానికి నవంబర్ 25లోగా సమర్పించాలన్నారు.