News February 18, 2025
MBNR: సద్వినియోగం చేసుకోండి: DIEO

ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించడానికి అవకాశం కల్పించినట్లు DIEO కౌసర్ జహాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాజరుకాని విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 16, 2026
MBNR: పీయూ..డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వివేకానంద డిగ్రీ కళాశాలలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ కే.ప్రవీణ మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు సజావుగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాఫీయింగ్కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.
News April 16, 2026
జడ్చర్ల: పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని కొడుగల్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి బిమ్లాగాని తండాకు చెందిన జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న సురేష్ హాస్టల్ రూంలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2026
సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


