News September 14, 2024
MBNR: సర్వే చేపట్టినా.. అందని పోడు భూముల పట్టాలు!

సంవత్సరాలు గడుస్తున్నా అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేసినా అధికారులు పట్టాలు పంపిణీ చేయలేదు. దీంతో రైతన్నలు నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని NGKL, MBNR,WNP, NRPT జిల్లాల్లో పోడు భూములు ఉండగా.. 15,583 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 7,514 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం త్వరగా పోడు పట్టాలను అందించి రైతులు కోరుతున్నారు.
Similar News
News December 19, 2025
MBNR: T-20 క్రికెట్ లీగ్.. మొత్తం 5 జట్లు

మహబూబ్నగర్లో ఈనెల 22 నుంచి జి.వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా టీ-20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈ లీగ్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందన్నారు. ప్రతి జట్టులో 15 మంది క్రీడాకారులను ఇప్పటికే ఎంపికలు చేశామన్నారు.
News December 18, 2025
MBNR: 19న “FSSAI లైసెన్స్,రిజిస్ట్రేషన్ మేళా”

మహబూబ్నగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 19న నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారి నీలిమ తెలిపారు. ఈ మేళా మహబూబ్ నగర్ నందు ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం(IDOC) గది నెం.218లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 81212 59373, 70134 83730 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News December 18, 2025
ఉమ్మడి జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

✒విశాఖ ఎక్స్ప్రెస్ను పొడిగించాలి:ఎంపీ డీకే అరుణ
✒MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్:SP
✒సర్పంచుల మరణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం:MLA అనిరుధ్ రెడ్డి
✒MBNR: రేపు అంబులెన్స్ డ్రైవర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
✒T-20 క్రికెట్ లీగ్.. జట్ల ఎంపికలు పూర్తి
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పంచాయితీ పోరులో కాంగ్రెస్ హవా
✒MBNR: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్


