News July 9, 2024
MBNR: సీఎం జిల్లా పర్యటన.. భారీ బందోబస్తు

జిల్లా కేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్తో పాటు ఏఎస్ఎన్ గార్డెన్ సోమవారం ఎస్పీ జానకి పరిశీలించారు. ఏఎస్ఎన్ గార్డెన్లో సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.
Similar News
News November 13, 2025
మహబూబ్నగర్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మిడ్జిల్ (దోనూరు)లో 12.7 డిగ్రీలు, గండీడ్ (సల్కర్పేట)లో 13.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర చలి ప్రభావంతో పాల దిగుబడి తగ్గిందని రైతులు తెలిపారు.
News November 12, 2025
MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

మహబూబ్నగర్లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.
News November 12, 2025
MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.


