News March 20, 2025

MBNR: సీఎం మానస పుత్రికకు నిధులేవి..?: నరసింహ

image

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.

Similar News

News November 18, 2025

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

News November 18, 2025

‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

News November 18, 2025

పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: జిన్నింగ్‌ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.