News March 20, 2025
MBNR: సీఎం మానస పుత్రికకు నిధులేవి..?: నరసింహ

నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని జల సాధన సమితి కో కన్వీనర్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన మానస పుత్రికగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకుని జిల్లా అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
Similar News
News November 23, 2025
హనుమకొండ: 25-29 వరకు ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ

జిల్లాలో ప్రీప్రైమరీ విద్యా బోధన నాణ్యతను మెరుగుపర్చేందుకు 45 పాఠశాలల నుంచి ఎంపికైన 45 ఇన్స్ట్రక్టర్లకు ఈ నెల 25-29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరిగే ఈ శిక్షణలో బోధనా నైపుణ్యాలు, తరగతి నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై డీఆర్పీలు మార్గదర్శనం చేయనున్నారు. డిసెంబర్ 1న హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్సు డైరెక్టర్ డా.బండారు మన్మోహన్ తెలిపారు.
News November 23, 2025
HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
News November 23, 2025
29న కాకినాడ జిల్లాకు పవన్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు కాకినాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్పై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.


