News March 2, 2025

MBNR: సీఎం రాకతో భారీ బందోబస్తు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జోగులాంబ జోన్-7 ఎల్ ఎస్ చౌహన్ ఏర్పాట్లను పరిశీలించారు. నలుగురు SPలు, మరో నలుగురు అడిషనల్ SPలు, CIలు-21, SIలు-28, ASIలు-140, హెడ్ కానిస్టేబుళ్లు,కానిస్టేబుళ్లు, హోంగార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

Similar News

News February 24, 2026

DMK కూటమిలో సీట్ల సెగ.. 45 స్థానాలకు కాంగ్రెస్‌ పట్టు?

image

తమిళనాడు ఎన్నికల వేళ అధికార DMK నేతృత్వంలోని కూటమిలో సీట్ల గొడవ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో DMK ఓడిపోయిన స్థానాల్లో కనీసం 20 చోట్ల తమకు బలం ఉందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. CM స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌కు 25 సీట్లకు మించి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదట. మరోవైపు IUML, MMK చెరో 5 సీట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్.

News February 24, 2026

చిన్నప్పటి బరువు.. పెద్దయ్యాక గుండెపోటు?

image

పదేళ్ల వయసులో ఉండే బాడీ మాస్ ఇండెక్స్, అలాగే 1 నుంచి 18 ఏళ్ల మధ్య పెరిగే బరువు తీరు భవిష్యత్తులో షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లల బరువులో వచ్చే మార్పుల్లో 25% కేవలం జీన్స్ వల్లే జరుగుతాయని ఈ స్టడీ చెబుతోంది. చిన్నప్పుడు బరువు పెరగడం ఊబకాయం కిందకు రాదని, కానీ ఎదుగుదల వేగాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

News February 24, 2026

జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

image

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.