News July 12, 2024
MBNR: సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్

CM రేవంత్ రెడ్డిని గద్వాల కాంగ్రెస్ ఇంచార్జి సరిత తిరుపతయ్య గురువారం సచివాలయంలో MP మల్లురవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ సీఎంకు సరిత వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ లో ఉన్న పలు ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రాజెక్టులకై ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు. గట్టు కృష్ణమూర్తి, శ్రీధర్ పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

మహబూబ్నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News November 15, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం

అడ్డాకుల మండలం రాచాల సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చౌడాయపల్లికి చెందిన మహిళా కూలీలు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీ పద్మ(30) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ బురమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న వినయ్కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 11.1, గండీడ్ మండలం సల్కర్పేటలో 11.3, మిడ్జిల్లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్పూర్లో 12.7, మహ్మదాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


