News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 28, 2025
సాలూరు: వేధిస్తున్నాడంటూ వ్యక్తిపై మహిళ ఫిర్యాదు

సాలూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కారుణ్య నియామకం కోసం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ఓ మంత్రి వద్ద అనధికారిక పీఏగా విధులు నిర్వహిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైందని వైసీపీ Xలో ఆరోపించింది.
News November 28, 2025
పల్నాడు: వెంటపడొద్దు అన్నందుకు చంపేశారు..!

బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రేమిడిచర్లలో శామ్యేల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యువతి తన తండ్రికి చెప్పడంతో ఆయన సదరు యువకుడిని తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి తండ్రిని రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI షమీర్ బాషా తెలిపారు.
News November 28, 2025
జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.


