News March 11, 2025

MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

image

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 20, 2025

మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్.. స్పందించిన ఎన్వీఎస్ రెడ్డి

image

TG: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ విషయం తన దృష్టికి వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా సంబంధిత యాడ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు అనైతికమని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను మెట్రోలో నిషేధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

News March 20, 2025

నంద్యాల జిల్లా TODAY NEWS

image

☞ ఏప్రిల్ 19న కర్నూలుకు సీఎం చంద్రబాబు ☞ వాగులోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి గల్లంతు ☞ టంగుటూరులో బైరెడ్డి పూజలు ☞ ఈనెల 22న ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ ☞ అవుకులో నకిలీ రంగుల కలకలం ☞ కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు: కలెక్టర్ ☞ యాగంటి హుండీ ఆదాయం రూ.29.18 లక్షలు ☞ మహానందిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ☞ ట్రోపీలు అందుకున్న జిల్లా నేతలు ☞ ఈనెల 23న జిల్లాకు భారీ వర్ష సూచన

News March 20, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>రాజవొమ్మంగి: పెరిగిన పొగాకు పంట సాగు
>పాడేరు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
>మారేడిమిల్లి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
>అనంతగిరి: చందాలెత్తుకుని మట్టి రోడ్డు నిర్మాణం
>డుంబ్రిగుడ: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
>రంప: 300మందికి పవర్ స్ప్రేయర్లు పంపిణీ
>అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
>పాడేరు: వ్యాన్‌ను ఢీకొని యువకుడు మృతి

error: Content is protected !!