News March 29, 2024

MBNR: స్కాలర్షిప్ దరఖాస్తుకు చివరి అవకాశం

image

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31తో గడువు ముగియనుంది అని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని కొత్తవారు లేదా రెన్యువల్ చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వివరించారు.

Similar News

News February 14, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన AIFB విజేతలు
✒పాలమూరు: జాగృతి, AIFB ఉమ్మడి విజయం: జోజిరెడ్డి
✒జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ
✒పాలమూరుకు మహర్దశ.. రూ.3,175 కోట్లతో హైవే
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పాలమూరులో ‘గ్లాసు’ ఖాళీ.. ప్రభావం చూపని జనసేన
✒గద్వాల్:జంపింగ్ ఎమ్మెల్యేలకు BRS ‘విప్’ సెగ
✒శివరాత్రి.. రేపు ఆలయాల వద్ద బందోబస్తు:SP

News February 14, 2026

MBNR: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

image

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లల మర్రి వద్దనున్న శివాలయం వద్ద పటిష్ఠ భద్రత ఆ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.

News February 14, 2026

జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ

image

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్‌లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్‌నగర్ జిల్లాకు, జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఇవాళ స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందజేశారు. ఈనెల 17 నుంచి HYDలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొననున్నారు.