News February 12, 2026

MBNR: అందరి చూపు అటువైపే..

image

మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి చూపు రేపటి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ఓట్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. బయటకు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నా.. సర్వేల్లో విభిన్న ఫలితాలు రావడం, పోలింగ్ తర్వాత అభ్యర్థులు డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల ద్విముఖ, త్రిముఖ పోరు, బలమైన నాయకులు ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

News February 19, 2026

శ్రీలంకకు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

image

T20 WC సూపర్-8కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్ మతీశ పతిరణ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడారు. అతడు కోలుకోవడానికి 4-5 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు IPLలోనూ పతిరణ ఆడటం డౌటేనని తెలుస్తోంది. అతడిని KKR ₹18 కోట్లకు <<18581979>>కొనుగోలు<<>> చేసింది.

News February 19, 2026

VZM: ‘ఏప్రిల్ 11 నాటికి పూర్తి చేయాలి’

image

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.