News November 11, 2025
MBNR: ఆజాద్ సేవలు ఆదర్శం: కలెక్టర్

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన ఆజాద్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి అంకిత భావంతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
మహిళలకు స్వయం ఉపాధి ఉచిత శిక్షణ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో ఉచిత భోజన వసతితో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 11, 2025
మూసాపేట: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై ఉన్న వర్ణమాల, సరళ పదాలను విద్యార్థులతో చదివించి తెలుసుకున్నారు. అక్షయపాత్ర ద్వారా అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 11, 2025
MBNR: ‘ధాన్యం కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉండొద్దు’

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మూసాపేట మండలం తిమ్మాపూర్, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కల్పించిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆరా తీశారు.


