News March 9, 2025
MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 10, 2025
రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 10, 2025
భువనగిరి: ‘జీవో నంబర్ 34ను అమలు చేయాలి’

దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, జీవో నంబర్ 34ను వెంటనే అమలు చేయాలని సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు NPRD జిల్లా అధ్యక్షుడు సురపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి లలిత, జిల్లా ఉపాధ్యక్షురాలు పార్వతి, హరిబాబు, చందు, స్వామి, జెరీష, గోపి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్ ‘బరిలో పెద్దపల్లి యువకుడు’

పెద్దపల్లి(D) ఓదెల మండలం గూడెంకి చెందిన సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటు హక్కుతో దేశ ప్రగతిని నిర్మించవచ్చని ప్లకార్డులతో కాలనీల్లో పర్యటించారు.


