News March 9, 2025

MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

image

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 9, 2025

వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

image

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మండలం చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న విజయేందర్ రెడ్డి(16) గురువారం వారి పొలం వద్దకు వెళ్లాడు. దీంతో చదువుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు అని తల్లి మందలించింది. దీంతో పురుగు మందు తాగిన విజయేందర్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

News March 9, 2025

MBNR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌‌కు నిధులు

image

రాష్ట్రంలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి, నారాయణపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, గద్వాల్, జడ్చర్లలో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని భట్టి తెలిపారు.

News March 9, 2025

ఎన్టీఆర్: జిల్లా టీడీపీ నేతలకు ఈసారి మొండిచెయ్యి 

image

MLA కోటాలో MLC స్థానాలకు టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ఆదివారం ఎంపిక చేసింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు నాయకులు పదవి ఆశించినప్పటికీ వారికి పదవీయోగం లభించలేదు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును టీడీపీ తమ MLC అభ్యర్థులుగా ఎంపిక చేసింది. కాగా ఒక సీటును బీజేపీకి కేటాయించగా, జనసేన నుంచి ఆ పార్టీ నేత నాగబాబును పవన్..MLC అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

error: Content is protected !!