News February 11, 2025

MBNR: ఎన్నికల నిర్వహణపై శిక్షణ 

image

ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాస్టర్ ట్రైనర్లుగా నియమించిన వారు ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిర్వహణ నిబంధనలపై అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం ZP సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు మండల స్థాయి ట్రైనర్లకు ZPTC, MPTC గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Similar News

News February 11, 2025

MBNR: ఈనెల 14 ,15వ తేదీల్లో మహానగరోత్సవం

image

ఈనెల 14 ,15వ తేదీలలో మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ మహానగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మంగళవారం శిల్పారామం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

News February 11, 2025

MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.

News February 11, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.

error: Content is protected !!