News April 10, 2025
MBNR : ఏప్రిల్ 12వ తేదీ నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి & మహబూబ్ నగర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Similar News
News September 15, 2025
ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

ములుగులోని ప్రేమ్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న తిప్పనపల్లి శాంతకుమార్ గా గుర్తించారు. రెండు బైకులు ఢీకొవడంతో శాంతకుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
VJA: దుర్గమ్మ దర్శనానికి దసరా మొబైల్ యాప్, చాట్బాట్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూపొందించిన మొబైల్ యాప్, చాట్బాట్లను దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ EO శీనా నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సేవలు భక్తులకు ఉపయోగపడతాయని తెలిపారు. కాగా ‘దసరా 2025’ పేరుతో యాప్, 9441820717 నంబర్తో చాట్బాట్ అందుబాటులోకి వచ్చాయి.
News September 15, 2025
కొడంగల్: సీఎం ఇలాకాలో సిమెంట్ ఫ్యాక్టరీ..!

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలోని ధర్మాపూర్ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సున్నపు నిక్షేపాలు వెలికి తీసేందుకు డ్రిల్లింగ్ చేసి ల్యాబ్కు పంపించారు. ధర్మాపూర్, టేకుల్ కోడ్, గండ్లెపల్లి, ఇందనూర్ పరిసర ప్రాంతాల్లోని ఫారెస్టు, ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మూడు వేల ఎకరాల్లో సిమెంట్ తయారీకి అవసరమయ్యే నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు.