News March 29, 2025
MBNR: ‘కవులకు పుట్టినిల్లు.. పాలమూరు’

పాలమూరు జిల్లా కవులకు పుట్టినిల్లని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఓ కవి సమ్మేళనంలో.. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర కవి అనగా.. సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవులతో గోలకొండ కవుల సంచిక గ్రంథాన్ని రాసి చరిత్ర సృష్టించారన్నారు. ముకురాల రామారెడ్డి, రుక్ముద్దీన్, రాళ్లపల్లి అనంత శర్మ, పాకాల యశోదా రెడ్డి, కపిలవాయి లింగమూర్తి కవులు పాలమూరు ఖ్యాతిని పెంచారన్నారు.
Similar News
News July 5, 2025
తల్లిదండ్రులకు పోలీసుల సూచన!

పిల్లలు ఇంటి నుంచి తరగతి గదికి చేరే వరకూ సురక్షితంగా వెళ్తున్నారా? లేదా? అనేది చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు & బస్సు డ్రైవర్లపై ఉందని పోలీసులు తెలిపారు. ‘స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? నైపుణ్యం కలిగిన డ్రైవరేనా? పికప్, డ్రాప్ టైమ్ను పాటిస్తున్నారా? లేదో గమనించాలి. స్కూల్ యాజమాన్యాలు బస్సుల్లో ఎమర్జెన్సీ నంబర్లను రాసి ఉంచాలి’ అని ట్వీట్ చేశారు.
News July 5, 2025
పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

పెందుర్తిలో వ్యభిచార గృహంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. భార్యాభర్తలమంటూ బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ సుజాతనగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం రావడంతో సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. వారిద్దరితో పాటు ఓ విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డుతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఐ సూచించారు.
News July 5, 2025
గిల్ మరో సెంచరీ

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.